అమరావతి, 19 జూన్ (హి.స.)‘రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యతగా భావిస్తూ, అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను..’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్కల్యాణ్ బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా సమగ్ర అభివృద్ధి నివేదిక (Comprehensive development report) విడుదల చేశారు. దీనితో పాటు పవన్కల్యాణ్ఓ లేఖను విడుదల చేశారు. ‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు... గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్లు నుండి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’ అని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి