హైదరాబాద్, 2 జూన్ (హి.స.) పదేళ్లయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర
ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కామెంట్ చేశారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని.. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు. రానున్న రోజుల్లో క్యూఆర్ కోడ్ కార్డు ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామి అన్నారు. వారికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..