హైదరాబాద్, 2 జూన్ (హి.స.)
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. తెలంగాణను 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారురని. ఇది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్. దోపిడీ, దగా, మోసం చేయడంలో దొందుదొందే. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. ల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు కిషన్ రెడ్డి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..