అమరావతి, 2 జూన్ (హి.స.)
జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణ 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. జూన్ 15 నుంచి జులై 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి చదువుతున్న గ్రామీణ నేపథ్యమున్న విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు తప్పనిసరిగా మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య జన్మించి ఉండాలి. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశ తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 (శనివారం)న ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 11న రెండో దశ పరీక్ష జరుగుతుంది. ఈ మేరకు నవోదయ విద్యాలయ సంస్థ ప్రవేశ పరీక్ష వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. వీటి ఫలితాలు వచ్చే ఏడాది జూన్లో విడుదల కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి