తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, 2 జూన్ (హి.స.) తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.. తెలంగాణ కోసం అమరులైన వారికి అంజలి ఘటించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 2 జూన్ (హి.స.) తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.. తెలంగాణ కోసం అమరులైన వారికి అంజలి ఘటించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం, రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించడం లేదని మండిపడ్డారు....'జాగృతి కొత్త కార్యాలయంలో మొదటి సారి జెండా ఎగురవేసినం. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారు. అది మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమ తో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదు. అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం నివాళులు కూడా అర్పించడం లేదు. అమరవీరులకు నివాళులు అర్పించే వరకు మా జాగృతి పోరాటం చేస్తుంది' అని వ్యాఖ్యలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande