రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే: సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, 2 జూన్ (హి.స.)ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎక్స్(Twitter) ట్విట్
రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే: సీఎం చంద్రబాబు నాయుడు


అమరావతి, 2 జూన్ (హి.స.)ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎక్స్(Twitter) ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన తన్ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా.. తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్ర స్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను. అని సీఎం చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande