వైసీపీ హయాంలో ఆరోజు జగన్ ఎందుకు మాట్లాడలేదు..--వంగలపూడి అనిత
విజయవాడ, 2 జూన్ (హి.స.)తప్పు చేసిన వారికి కులం, మతం ఏంటని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెనాలిలో (Tenali) ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై కొట్టిన ఘటనకు సంబంధించి ఆమె తొలిసారిగా స్పం దించారు. వారిని పరామర్శించేందుకు రేపు మాజీ సీఎం జగన్ (YS
వైసీపీ హయాంలో ఆరోజు జగన్ ఎందుకు మాట్లాడలేదు..--వంగలపూడి అనిత


విజయవాడ, 2 జూన్ (హి.స.)తప్పు చేసిన వారికి కులం, మతం ఏంటని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెనాలిలో (Tenali) ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై కొట్టిన ఘటనకు సంబంధించి ఆమె తొలిసారిగా స్పం దించారు. వారిని పరామర్శించేందుకు రేపు మాజీ సీఎం జగన్ (YS Jagan) ​తెనాలి వెళుతున్న నేపథ్యంలో ఆమె విలేకరులతో పలు విషయాలు వెల్లడించారు.

విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ఈ రోజు డీజీపీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై ఎన్ని కేసులు ఉన్నాయో డీజీపీ (DGP) వివరాలు మీడియాకు తెలియజేశారని గుర్తు చేశారు. ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపా ర్ట్మెంట్ మీద చేయి చేసుకున్నప్పుడు, జరిగిన ఘటనను రాజకీయరంగు పులిమి, కులం మతం అంటగట్టటం ఏంటన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందన్నారు. మాస్క్ అడిగిన పాపానికి గతంలో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై రెక్కలు విరిచి నడిరోడ్డుపై చొక్కా విప్పిన సందర్భాన్ని మర్చిపోయారా అని జగన్​ను అన్నారు.

ఆరోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసినప్పుడు..మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నాడని తెలిపారు. రాజమండ్రిలో వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి శిరోముండనం చేశారని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande