అమరావతి, 20 జూన్ (హి.స.)
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ఎడ్సెట్ ఫలితాలు(AP EdCET 2025 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్() ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 99.42శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,795మంది రిజిస్టర్ చేసుకోగా.. 14,527మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్సెడ్ హాల్టికెట్తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు, ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆచార్య నాగర్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 5న ఎడ్సెట్ను నిర్వహించి ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ