హైదరాబాద్, 20 జూన్ (హి.స.) శంషాబాద్ మున్సిపాలిటీ 100రోజుల ప్రణాళికలను తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పర్యవేక్షించారు. శంషాబాద్ మున్సిపల్ పట్టణ పరిధిలో వంద రోజుల ప్రణాళికను అడిగి, అలాగే సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సుమన్ రావును, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, ఆర్డీఓ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్