హైదరాబాద్, 20 జూన్ (హి.స.)
తనపై నమోదైన నాలుగు కేసులు
కొట్టేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఆ కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు.. కోర్టుకు హాజరు నుంచి బండి సంజయ్కు మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. కాగా, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్