నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోనకల్.గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును.పోలీసులు చేధించారు
అమరావతి, 20 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన క
నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోనకల్.గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును.పోలీసులు చేధించారు


అమరావతి, 20 జూన్ (హి.స.)

నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ మాట్లాడుతూ.. మామడ మండలం పోన్కల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ హరీశ్ కుమార్ ను కిడ్నాప్ చేసి 3 కోట్ల రూపాయలను ఆ ముఠా డిమాండ్ చేసిందని అన్నారు. అయితే, సూత్రదారి బాధితుడి పాత కారు డ్రైవర్ హైదర్ గా తేలిందని ఎస్పీ చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande