తెలంగాణ, ఖమ్మం 20 జూన్ (హి.స.)
అధికారులు, సిబ్బంది విధులకు
సకాలంలో హాజరై సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి రెవెన్యూ సిబ్బంది పనితీరుపై వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ లో పని చేసే సిబ్బంది మొత్తం ఒక బృందంగా పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, ప్రజలకు, అధికారులకు మంచి వారధిగా ఉండాలన్నారు.
సోమవారం వచ్చే ప్రజావాణి దరఖాస్తులు, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల దగ్గర నుంచి వచ్చే ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ పెట్టకుండా క్లియర్ చేయాలని, తమ పరిధిలో సమస్య పరిష్కారం ఐతే వెంటనే చేయాలని, లేని పక్షంలో సంబంధిత కారణాలు తెలుపుతూ ఫైల్ క్లోజ్ చేయాలని, లబ్దిదారునికి ఎందుకు ఆ పని చేయలేక పోతున్నామో కారణాలతో కూడిన లేఖ రాయాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు