10 నెలల్లోనే 21 వేల కోట్లు రుణమాఫీ : : మంత్రి పొంగులేటి
తెలంగాణ, ఖమ్మం. 20 జూన్ (హి.స.) బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదిసంవత్సరాల్లో 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం
మంత్రి పొంగులేటి


తెలంగాణ, ఖమ్మం. 20 జూన్ (హి.స.)

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదిసంవత్సరాల్లో 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణలతో కలిసి పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నర కాలం పూర్తిచేసుకుందని ఈ సమయంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాల్లో కచ్చితంగా చోటు దక్కుతుందన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande