ఆరు గ్యారంటీల అమలకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి వివేక్
తెలంగాణ, సిద్దిపేట. 20 జూన్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలకు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన చేశారు. స్కూల్ టైంలో కాకుండా మిగిలిన సమయంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం
వివేక్


తెలంగాణ, సిద్దిపేట. 20 జూన్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలకు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన చేశారు. స్కూల్ టైంలో కాకుండా మిగిలిన సమయంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకునే వీలు ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి ఫంక్షన్ లో సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కే హైమావతి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ తో కలిసి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ఆరు గ్యారంటీల అమలకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కురికపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నారని కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande