హైదరాబాద్, 20 జూన్ (హి.స.) , : బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.కోటి విరాళం అందజేశారు. ఈ మొత్తం బుధవారం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో కృష్ణ వారికి ఆలయ విశిష్టతను వివరించి.. దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగిస్తామని ఆలయ ఇన్ఛార్జి ఈవో మహేందర్గౌడ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ