సన్న వడ్ల బోనస్ పై సర్కార్ బోగస్ మాటలు.! : హరీశ్రావు
హైదరాబాద్, 20 జూన్ (హి.స.) సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల బోనస్పై సన్నాయి నొక్కులేనా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ. 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మ
హరీష్ రావు


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల బోనస్పై సన్నాయి నొక్కులేనా అని

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ. 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.

4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. సన్ ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతున్నది. ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande