అమరావతి, 20 జూన్ (హి.స.)
పశ్చిమబెంగాల్లోని పురులియా జిల్లా బలరాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కాగా.. ట్రక్కు ఓ వైపు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ