హైదరాబాద్, 20 జూన్ (హి.స.)
రాష్ట్ర మంత్రులకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరి శాఖల గురించి మరో మంత్రి మాట్లాడటానికి వీళ్లేదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలపై మాట్లాడటం కరెక్ట్ కాదని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించాను.. ఆయన కూడా దానిపై వివరణ ఇచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసమే అలా మాట్లాడినట్లు తెలిపారు. ఇక నుంచి ఎవరూ అలా మాట్లాడటానికి వీళ్లేదు.. హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్