తెలంగాణ,వరంగల్. 20 జూన్ (హి.స.) వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు. కార్డియాలజీ విభాగంలోని ఫిర్యాదుల పెట్టేను తెరిచి ఫిర్యాదులను పరిశీలించారు. విద్యకు, నర్సింగ్ ఆఫీసర్లు రోగుల పట్ల కటువుగా ప్రవర్తిస్తున్నారని ఉన్న పిర్యాదును వైద్యులకు, నర్సింగ్ సిబ్బందితో చదివించి, రోగులను పట్ల మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు.
టూ డీ ఈకో సెంటర్ ను పరిశీలించి మరమ్మత్తులో ఉన్న మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం డైక్ సెంటర్ని పరిశీలించారు. శానిటేషన్ విధుల్లో తప్పనిసరిగా షిఫ్టుల విధానాన్ని కొనసాగించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు