విశాఖ తీరంలో చేపల వేట నిషేధం..
విశాఖపట్నం , 20 జూన్ (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని విశాఖ సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో రేపు(జూన్ 21) నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day)లో పాల్గొనేందుకు ప్రధాని నరేం
విశాఖ తీరంలో చేపల వేట నిషేధం..


విశాఖపట్నం , 20 జూన్ (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని విశాఖ సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో రేపు(జూన్ 21) నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day)లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా విశాఖ(Visakhapatnam) సముద్ర తీరంలో చేపల వేటను ఈ రోజు(శుక్రవారం), రేపు(శనివారం) నిషేధించారు. ఈ మేరకు సంబంధిత వివరాలను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్‌జట్టి తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande