తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 21 జూన్ (హి.స.)
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం
పదేళ్లల్లో చేయనివి ఇందిరమ్మ ప్రభుత్వం పది నెలల్లో చేసి చూపిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఎ పీఓ రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లతో కలిసి గుండాల మండలం జగ్గుతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేద ప్రజల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు