అమరావతి, 22 జూన్ (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు సూర్యుడు సైతం సెగలు కక్కలు కక్కుతున్నాడు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిక్కుల గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి