అమరావతి, 22 జూన్ (హి.స.)
కృష్ణాజిల్లా(గుడివాడ): కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు () జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ) సూచించారు. ఇవాళ(ఆదివారం) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24వ గ్రాడ్యుయేషన్ డేలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను ఎన్వీ రమణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ