తెలంగాణ, కరీంనగర్. 22 జూన్ (హి.స.)
కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో ఆదివారం నాడు ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రూపాయి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి అని అన్నారు.అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదు విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలు ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ‘అందరికీ ఇచ్చాం అవకాశం, ఇక బీజేపీకి ఇద్దాం అధికారం అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు.
కాళేశ్వరం విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరంపై మా స్టాండ్ వెరీ క్లియర్ అని, మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అని అన్నారు. ఊసరవెల్లిలా మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదని చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యం అందరికీ తెలుసునని, పదేళ్లు నీతివంతమైన పాలన చేసిన మోదీ ఏ ఆధారాల్లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతారా? ఆలోచించండి అని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు