11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు
అమరావతి, 22 జూన్ (హి.స.) అభివృద్ధి లో దేశం ఎలా ముందుకు వెళ్ళాలో ప్రపంచానికి తెలిసేలా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.. అప్పుడు పాకిస్థాన్ ఆడిందే ఆటగా ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా దేశాన్ని అంతలాకుతలం చేసిందని.. అప్పుడు లుంబి
11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు


అమరావతి, 22 జూన్ (హి.స.)

అభివృద్ధి లో దేశం ఎలా ముందుకు వెళ్ళాలో ప్రపంచానికి తెలిసేలా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.. అప్పుడు పాకిస్థాన్ ఆడిందే ఆటగా ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా దేశాన్ని అంతలాకుతలం చేసిందని.. అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుక్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలకు తావు లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. అప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉండేదని.. కానీ, మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాద దాడికి సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెప్పారు.. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోడీ మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారని కొనియాడారు. అమెరికాను తలతన్నే విధంగా మన దేశంలో రోడ్లు నిర్మించారని.. జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి సొంతమన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రైల్వే స్టేషన్ డెవలప్ కాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.” కానీ మోడీ మాన రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశారు.. విద్యుత్ లేకుండా ఏ గ్రామం కూడా ఉండొద్దని మోడీ తలచుకుని.. మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా అందించారు. కొంత మంది రాజకీయ పార్టీలు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు.. అప్పుడు ప్రపంచ స్థాయిలో అధినేతల మీటింగ్ జరిగితే మన ప్రధాని ఎక్కడున్నాడని వెతుక్కునే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యాక ముందు వరసలో మన ప్రధాని కనిపిస్తున్నారు.. గతంలో ఏదైనా దాడి జరిగితే.. క్యాండిల్ లైట్లతో ర్యాలీ తీసేవాళ్ళం.. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తయారైన బ్రహ్మోస్ తో ఎదురు దాడి చేస్తామని పాకిస్థాన్‌కి తెలియజేశాం.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబానికి బలి అయ్యింది.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలు చేసింది కేసీఆర్ కుటుంబం.. ఒక నియంత పాలనతో రాష్ట్రాన్ని వెనుకకు నెట్టారు.. ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకున్నారు.. కేసీఆర్ ను గద్దె దించాలని నిర్ణయించుకున్నారు.. కానీ., రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన చేతకాని హామీలతో మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు.. రైతులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, మహిళకు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారం చేపట్టింది కాంగ్రెస్.. ఇపుడు అధికారం చేపట్టాక ఏమీ చేయలేక పోతున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే అది బీజేపీ తోనే సాధ్యం.. రాష్ట్ర అప్పులను తీర్చి.. ప్రజలకి అభివృద్ధి అందించాలి అన్నా బీజేపీ తోనే సాధ్యం.. తెలంగాణ ఆకాంశ తీరాలాంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరుతున్నాను..” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande