జోగులాంబ గద్వాల, 22 జూన్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్య.మైన నవవరుడి మృతదేహం ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా, పాణ్యం లో లభ్యమైంది. జిల్లా కేంద్రానికి చెందిన జీ తేజేశ్వర్(33) లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు. జూన్ 17 మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయాడు. అయితే.. మే 18న కర్నూలుకు చెందిన యువతితో తేజేశ్వర్ కు వివాహమైంది. తేజేశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గద్వాల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. నంద్యాల జిల్లా, పాణ్యం సరిహద్దుల్లో గత రాత్రి తేజేశ్వర్ మృతదేహం గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాణ్యం లో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..