తెలంగాణ, ఖమ్మం. 22 జూన్ (హి.స.)
అర్హులైన పేదలకు దశల వారీగా
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రివర్యులు, ఏదులాపురం మున్సిపల్ పరిధిలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేపట్టామని అన్నారు. అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు