అమరావతి, 22 జూన్ (హి.స.)
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి కారులో ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీశారు. నలుగురిలో ఇద్దరు మరణించారు.
కారు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. కొడుకు, కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు ప్రమాదంకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ