అమరావతి, 22 జూన్ (హి.స.)
నంద్యాల: శ్రీశైలం దేవస్థానంలో ) ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు. హుండీ కౌంటింగ్ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని విచారణలో తేలడంతో ఇద్దరు ఉద్యోగులని సస్పెండ్ చేశామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. హుండీ కౌంటింగ్ చేసేందుకు తెచ్చిన చిల్లర నాణాలు గల సంచులను లెక్కించకుండా అక్కడే వదిలేసి సిబ్బంది వెళ్లిపోయారని ఆలయ ఈఓ శ్రీనివాసరావు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ