అంతర్జాతీయ.యోగా సందర్భంగా హై.కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు,న్యాయవాదులు కోర్తుండిబ్బడి.యోగాసనాలు
అమరావతి, 22 జూన్ (హి.స.) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు. ఏపీఎ్‌సపీఎఫ్‌ హైకోర్టు యూనిట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 200 మందికి పైగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది, అధి
అంతర్జాతీయ.యోగా సందర్భంగా హై.కోర్టు ప్రాంగణంలో  న్యాయమూర్తులు,న్యాయవాదులు కోర్తుండిబ్బడి.యోగాసనాలు


అమరావతి, 22 జూన్ (హి.స.)

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు వేశారు. ఏపీఎ్‌సపీఎఫ్‌ హైకోర్టు యూనిట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 200 మందికి పైగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఏపీఎ్‌సపీఎఫ్‌ విజయవాడ జోనల్‌ కమాండెంట్‌ ఎం. శంకరరావు, హైకోర్టు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కమాండెంట్‌ కె. శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు వి.ప్రసాద్‌, ఎంవీ శివకుమార్‌ తదితరులు యోగాసనాలు వేశారు. అదేవిధంగా విజయనగరంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్యర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి, జస్టిస్‌ ఏవీ శేషసాయి పాల్గొన్నారు. జిల్లా న్యాయాధికారి బబిత, ఇతర న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి యోగాసనాలు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande