హైదరాబాద్, 22 జూన్ (హి.స.) పచ్చిమాస్యాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16 మిలియన్లకు పైగా భారతీయులు గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాల్లో పనులు చేస్తూ.. నివసిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో యుద్ధం చెలరేగితే అక్కడ నివసించే భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలన్నింటిలో భారతీయ కంపెనీలు చేసిన పెట్టుబడులు, గణనీయమైన మొత్తంలో విదేశీ పెట్టుబడులు ఈ ప్రాంతం నుంచి వస్తాయని గుర్తు చేశారు. తాజాగా అమెరికా ఇరాన్ పై దాడిపై స్పందిస్తూ.. పాకిస్తాన్ జనరల్ అసీమ్ మునీర్ దీనికోసం అమెరికా అధ్యక్షుడితో విందు చేశారా? అని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్