క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధం.. పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు
హైదరాబాద్, 22 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న
పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని డా. నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడానికి తన మద్దతును అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి శాలువ కప్పి సత్కరించారు. కాగా, ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, అమెరికాలోని అగ్రశ్రేణి వైద్యుల్లో ఒకరిగా ఉన్నారు. మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande