శ్రీశైలం, 22 జూన్ (హి.స.) గత 20 రోజులుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో నదులకు వరద ఉధృతి కారణంగా.. జూరాల డ్యామ్ (Jurala Dam) పూర్తిగా నిండిపోయింది. దీంతో పూర్తి సీజన్ రాకముందే రెండో సారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో నేరుగా భారీ వరద శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) చేరుకుంటుంది. గతంలో వచ్చిన వరద కారణంగా శ్రీశైలంలో నీటి నిల్వలు (Water reserves) పెరిగాయి. తాజాగా మరోసారి జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) నెమ్మదిగా నిండుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 854.20 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి