తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. జూన్‌ 26 నుంచి శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం
తిరుపతి, 23 జూన్ (హి.స.) : శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం ( Periyalwar Utsavam ) అనేది వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఉత్సవం. ముఖ్యంగా తిరుపతి ( Tirupati )లోని దేవాలయాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన ఉత్సవం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (
శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం


తిరుపతి, 23 జూన్ (హి.స.)

: శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం ( Periyalwar Utsavam ) అనేది వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఉత్సవం.

ముఖ్యంగా తిరుపతి ( Tirupati )లోని దేవాలయాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన ఉత్సవం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Venkateswara Temple) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి (Govindaraja Swamy) వారి ఆలయ అనుబంధమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించబడుతుంది.

ఈసారి జూన్‌ 26వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవంలో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి (Chinna Jeeyar Swamy) తమ శిష్య బృందంతో కలిసి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్‌ వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. ఇక ఆఖరి రోజైన జులై 5వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌ వారికి తిరుమంజనం (Tirumanjanam) నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామి (Sri Govindaraja Swami) వారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్‌ వారు గజ వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande