అమరావతి, 23 జూన్ (హి.స.) షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - నాగర్సోల్ మధ్య స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ స్పెషల్ రైళ్లు జులై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ - నాగర్సోల్ స్పెషల్ రైలు (07007) జులై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది.
అలాగే నాగర్సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు నాగర్సోల్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వెల్లడించింది.
ఈ రైలు రెండు మార్గాల్లో మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ రైలులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి