తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 23 జూన్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల
తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు


తిరుమల, 23 జూన్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే క్రమంలో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ వచ్చింది.

ఈ తరుణంలో తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ రోజు ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజు(సోమవారం) తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. కృష్ణ తేజ అతిథి గృహంలో బయట క్యూ లైన్‌ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 87,254 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.28కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande