హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు
సిమ్లా, 26 జూన్ (హి.స.) హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ స్థలం సమీపంలోని లేబర
హిమాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఇద్దరు మృతి.. 20 మంది గల్లంతు


సిమ్లా, 26 జూన్ (హి.స.)

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో ఉన్ 15-20 మంది కార్మికులు గల్లంతైనట్లుగా సమాచారం. ప్రాజెక్ట్ దగ్గర నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. బియాస్, సట్లెజ్ నదుల నీటి మట్టం పెరిగిందని అధికారులు చెప్పారు.

వర్షాలు కారణంగా ప్రాజెక్ట్ పనులు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. తాత్కాలిక ఆశ్రయాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా వరద రావడంతో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కొంత మంది క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 20 మంది కార్మికులు గల్లంతయ్యారని ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర విపత్తు దళం, స్థానిక అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande