చతిస్గడ్ లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..
ఛత్తీస్‌గఢ్ 26 జూన్ (హి.స.) మావోయిస్టులకు మ‌రోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్‌మడ్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.
ఎన్కౌంటర్


ఛత్తీస్‌గఢ్ 26 జూన్ (హి.స.)

మావోయిస్టులకు మ‌రోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్‌మడ్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురుకాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రమాదం పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో డీఆర్‌జీ నారాయణపూర్‌, కొండగావ్‌, ఎస్‌టీఎఫ్‌ అబుజ్‌మడ్‌ ప్రాంతంలో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande