కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!
అమరావతి, 26 జూన్ (హి.స.) ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు DA 57.47 శాతానికి కి చేరింది. దీంతో, 2025 రెండో అర్ధభాగంలో డీఏ 3 శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏను నాలుగు శాతం పెంచే యోచనలో ప్రభుత్వం!


అమరావతి, 26 జూన్ (హి.స.)

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం.. 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు DA 57.47 శాతానికి కి చేరింది. దీంతో, 2025 రెండో అర్ధభాగంలో డీఏ 3 శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం, ఈ పెంపు 3 శాతం పెరగవచ్చు . అయితే, ఈ ప్రకటనకు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున, ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు.

కేబినెట్ ఆమోదం అవసరం..

తాజాగా సవరించిన డీఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం అవసరం ఉంటుంది. సాధారణంగా జూలై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలను సమీక్షించి, కేబినెట్‌కు నివేదికను పంపుతుంది. తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ ప్రకటన తర్వాత నెలల వారిగా బకాయిలు కూడా చెల్లించబడతాయి.

అయితే ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏలను పెంచుతుంది. మొదటిగా జనవరిలో డీఏ పెంపు ప్రకటన చేసి.. ఈ ప్రకటనకు సంబంధించిన డీఏలను మార్చి-ఏప్రిల్‌లో చెల్లిస్తుంది. రెండోసారి జూలైలో డీఏలను ప్రకటింది, రెండు-మూడు నెలలు తర్వాత వాటిని చెల్లిస్తుంది. అయితే రెండో సారి ప్రకటన తర్వాత బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande