యూట్యూబర్‌ జస్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు
న్యూఢిల్లీ, 8 జూన్ (హి.స.) పాకిస్థాన్‌ కోసం భారత్‌లో గూఢచర్యం చేస్తున్న కేసులో అరెస్టయిన పంజాబ్‌ యూట్యూబర్‌ జస్బీర్‌సింగ్‌ ఫోన్‌లో 150 వరకు పాకిస్థాన్‌ కాంటాక్టులు (ఫోన్‌ నంబర్లు) ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన ఆరుసార్లు పాకిస్థాన్‌లో పర్
jasbir


న్యూఢిల్లీ, 8 జూన్ (హి.స.) పాకిస్థాన్‌ కోసం భారత్‌లో గూఢచర్యం చేస్తున్న కేసులో అరెస్టయిన పంజాబ్‌ యూట్యూబర్‌ జస్బీర్‌సింగ్‌ ఫోన్‌లో 150 వరకు పాకిస్థాన్‌ కాంటాక్టులు (ఫోన్‌ నంబర్లు) ఉన్నట్టు విచారణ అధికారులు గుర్తించారు. ఆయన ఆరుసార్లు పాకిస్థాన్‌లో పర్యటించి, నేరుగా పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ గూఢచారులతో భేటీ అయినట్టు తేల్చారు. గూఢచర్యం కేసులో అరెస్టయిన మరో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్‌కు పరిచయం ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు.. పాక్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి, ప్రస్తుతం యూట్యూబర్‌గా ఉన్న నాసిర్‌ థిల్లాన్‌ లాహోర్‌లో తనను ఐఎ్‌సఐ గూఢచారి, ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన డానిష్‌ అలియస్‌ ఎహ్సాన్‌ ఉర్‌ రెహ్మాన్‌కు పరిచయం చేసినట్టుగా జస్బీర్‌సింగ్‌ వెల్లడించినట్టు తెలిసింది. డానిష్‌ తన నుంచి కొన్ని సిమ్‌కార్డులు తీసుకున్నాడని.. పాక్‌ నిఘా అధికారి ఒకరికి తన ల్యాప్‌టా్‌పను గంటపాటు అప్పజెప్పానని వివరించినట్టు సమాచారం

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande