హైదరాబాద్, 10 జూలై (హి.స.)
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు (8th NATS Telugu Celebrations) వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేదిక ప్రాంగణం తెలుగు వాళ్ళతో క్రిక్కిరిసిపోయింది.ఈ సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ , అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు…థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఉర్రుతలూగించారు… తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి… సంబరాలే కాక సామాజిక బాధ్యతగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు అందజేశారు. మరియు నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్