నెల్లూరు, 12 జూలై (హి.స.)
: మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్ధన్రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని కాకాణిపై ముత్తుకూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ నిల్వల కేసులో రెండ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ కాకాణిని కస్టడీకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ