ఫోన్ టాపింగ్ కేసు విచారణకు హాజరైన బీసీ నేత వట్టే జానయ్య
హైదరాబాద్, 14 జూలై (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ సోమవారం బీసీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు
ఫోన్ టాపింగ్ కేసు


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ సోమవారం బీసీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేశారు. ఎన్నికలప్పుడు వట్టే జాన్యయ ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయనను సిట్ అధికారులు విచారణకు పిలవగా ఇవాళ ఇవాళ దర్యాప్తు అధికారులు ముందు హాజరైన వట్టే జానయ్య నుంచి అధికారులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande