పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై కలెక్టర్లకు ఈసీ కీలక ఆదేశాలు
హైదరాబాద్, 15 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో... ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు అని ఆశావా
ఎలక్షన్స్


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల

ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో... ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట ఎంపీటీసీ ఎన్నికల నిర్వహించాలని తెలంగాణ భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వాహణ ఉండటంతో అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు.

ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ల కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా..పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande