హైదరాబాద్, 18 జూలై (హి.స.)
: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మాలోత్ చందులాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)గా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ