నేడు అమరావతి రాజధానిలోని నీరుకొండలోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో రెండురోజులు గ్రీన్.హైడ్రోజన్ సమ్మిట్
అమరావతి, 18 జూలై (హి.స.) గుంటూరు, ):అమరావతి రాజధానిలోని నీరుకొండలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో రెండు రోజుల గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025 శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలి రోజున సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ సమ్మిట్‌ను ప్రారంభి
నేడు అమరావతి రాజధానిలోని నీరుకొండలోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో  రెండురోజులు గ్రీన్.హైడ్రోజన్ సమ్మిట్


అమరావతి, 18 జూలై (హి.స.)

గుంటూరు, ):అమరావతి రాజధానిలోని నీరుకొండలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో రెండు రోజుల గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025 శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలి రోజున సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ సమ్మిట్‌ను ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌లో ఉన్న పరిశోధన, అభివృద్ధి అవకాశాలు, వినియోగం తదితర అంశాలపై సీఎం ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్‌ కూడా ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌, నెడ్‌క్యాప్‌ ఎండీ డాక్టర్‌ ఎం.కమలాకర్‌బాబు తదితరులు సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande