తిరుమల, 18 జూలై (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. గత వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ రోజు(శుక్రవారం) ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు.
నిన్న(గురువారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి