తెలంగాణ, నాగర్ కర్నూల్. 2 జూలై (హి.స.)
ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత గల ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందుతాయన్నారు.
ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని.. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రజల నివాస అవసరాలను తీర్చే దిశగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు