అమరావతి, 20 జూలై (హి.స.)
నెల్లూరు: బిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీల యజామానులుగా మార్చేసి, వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం.. ఇది కుబేర సినిమాస్టోరీ(). ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నెల్లూరు జిల్లాలో కూడా అటు ఇటుగా ఇలాంటి ఘరానా మోసమే జరిగింది. నెల్లూరు జిల్లాలో) భారీ కుంభకోణం ) వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకోని భారీ స్కాంకు పాల్పడ్డారు కొంతమంది మోసగాళ్లు. కుబేరా సినిమా తరహాలో రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఈ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపి రుణాలు తీసుకుంది ఈ మాఫియా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ