లాల్‌ద‌ర్వాజా మ‌హాకాళి అమ్మ‌వారి బోనాలు ప్రారంభం..
హైదరాబాద్, 20 జూలై (హి.స.) పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది. ఉద‌యం అమ్మ‌వారికి కుమ్మ‌రి బోనం స‌మ‌ర్పించారు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంక
బోనాలు


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది. ఉద‌యం అమ్మ‌వారికి కుమ్మ‌రి బోనం స‌మ‌ర్పించారు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంకానికి చేరుకున్నాయి. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో లాల్‌దర్వాజ బోనాల జాత‌ర నేటి తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande